ఎన్టీఆర్ బయోపిక్ లో పదిమందికి పైగా కథానాయికలు!

  • షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్ 
  • ముఖ్యపాత్రల కోసం క్రేజీ కథానాయికలు 
  • ఎన్టీఆర్ బయోపిక్ కి ఇదో ప్రత్యేకత
ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బాల్యం .. విద్యాభ్యాసం .. సినిమాల్లో అంచలంచెలుగా ఎదగడం 'కథానాయకుడు'లో చూపిస్తారు. ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన విషయాలను 'మహానాయకుడు'లో ఆవిష్కరించనున్నారు. ఈ రెండు భాగాల్లోను కలిపి 10 మందికి పైగా కథానాయికలు కనిపించనున్నారు.ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకంగా విద్యాబాలన్ .. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ .. కృష్ణకుమారి పాత్రలో మాళవిక నాయర్ .. షావుకారి జానకి పాత్రలో షాలినీ పాండే .. శ్రీదేవి పాత్రలో రకుల్ .. జయప్రద పాత్రలో హన్సిక .. జయసుధ పాత్రలో పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో ఆమని .. ఈషా రెబ్బా .. మంజిమామోహన్ .. పూనమ్ బజ్వా కనిపించనున్నారు. ఇంతమంది కథానాయికలను కలిగిన సినిమాగా ఎన్టీఆర్ బయోపిక్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది.    
Go Back to Shorts
balakrishna
rakul
hansika
nithya

More Telugu News